సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏది క్లిక్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్, బడా డైరెక్టర్లు ఉంటేనే సినిమాలు ఆడతాయనే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కేవలం కంటెంట్ మాత్రమే కింగ్ అని మరోసారి నిరూపితమైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన భారీ చిత్రం ‘పెద్ది(Peddi)’ ఆశించిన స్థాయిలో రాణించలేక డీలా పడిపోగా.. అటు సమంత తన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’తో ఓవర్సీస్ మార్కెట్ను షేక్ చేస్తోంది.
నిజానికి సినిమా విడుదలకు ముందు సమంత తీవ్రమైన ఆందోళనలో ఉంది. ఒక కథానాయకిగా, నిర్మాతగా బాధ్యతలు మోస్తూ.. "కనీసం ఒక్క టికెట్ అయినా తెగుతుందా లేదా" అని భయపడినట్లు స్వయంగా ఆమె పేర్కొంది. కానీ, థియేటర్లలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ ‘మా ఇంటి బంగారం(Maa Inti Bangaaram)’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండో వారంలోనూ స్ట్రాంగ్ హోల్డ్తో దూసుకుపోతూ, నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మార్క్కు అత్యంత సమీపంలోకి వచ్చేసింది. సమంత కెరీర్లో 18వ సారి మిలియన్ డాలర్ క్లబ్లో చేరిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది.

మరోవైపు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీ, జాన్వీ కపూర్ గ్లామర్, శివన్న, జగపతిబాబు వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దాదాపు 6 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఓవర్సీస్ ఆడియన్స్ను మెప్పించలేకపోయింది. రిలీజ్కు ముందు నెల రోజుల నుంచే ప్రమోషన్లు చేసినా ప్రీ-బుకింగ్స్లో మిలియన్ మార్క్ అందుకోలేకపోయింది. థియేటర్లలోకి వచ్చాక కూడా నెగెటివ్ టాక్, క్యారెక్టర్ ప్రొజెక్షన్ సరిగ్గా లేకపోవడంతో 3.5 మిలియన్ల మార్క్ దాటడానికి కూడా అష్టకష్టాలు పడుతోంది. ఈ పరిణామాలు ట్రేడ్ వర్గాలను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యం అనుకున్న కలెక్షన్లను సమంత(Samantha) కేవలం తన బ్రాండ్ ఇమేజ్, కంటెంట్ బలంతో సాధించి చూపించింది.