టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ‘బేబి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ జంట, ఆ తర్వాత రీసెంట్గా ‘ఎపిక్’(Epic) ప్రాజెక్ట్లోనూ కలిసి సందడి చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ జోరుగా ప్రచారం సాగింది. రీల్ లైఫ్లో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి అభిమానులు నిజ జీవితంలో కూడా వీరు ప్రేమలో ఉన్నారంటూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు, త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ నెట్టింట రకరకాల ఊహాగానాలు వైరల్ అయ్యాయి.
అయితే ఈ డేటింగ్ రూమర్లపై తాజాగా వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్ అయిపోయారు. ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందిస్తూ ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమ మధ్య రొమాంటిక్ రిలేషన్షిప్ ఉందనడంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తామిద్దరం కేవలం మంచి కో-స్టార్స్ మాత్రమే కాదని, మంచి స్నేహితులమని స్పష్టం చేశారు.
ఇదే ఇంటర్వ్యూలో ఆనంద్ దేవరకొండ పెళ్లి ప్లాన్స్ గురించి కూడా వైష్ణవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) రాబోయే మూడేళ్లలో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నాడని ఆమె వెల్లడించారు. మరి మీ పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఎదురైనప్పుడు, తనకు మాత్రం ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని, కెరీర్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని వైష్ణవి స్పష్టం చేయడంతో ఈ రూమర్స్కు ప్రస్తుతానికి ఫుల్స్టాప్ పడినట్లయింది.