వైసీపీలో బొత్సకు చెక్.. జగన్ మాస్టర్ ప్లాన్ అదేనా..?

admin
Published by Admin — August 26, 2026 in Politics, Andhra
News Image

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈమధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, వైఎస్సార్‌సీపీ(YSRCP)లో ఏదో పెద్ద తుఫానే రాబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపించిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చుట్టూ ఇప్పుడు అనుమానాల మేఘాలు అలుముకున్నాయి. పార్టీలో ఆయన ప్రాభవాన్ని తగ్గించేందుకు అధిష్టానం తెరవెనుక పావులు కదుపుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఇదంతా కేవలం ప్రచారమా? లేక జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులా? అసలు ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది?

రాజకీయాల్లో మౌనం కొన్నిసార్లు చాలా అర్థాలను తెస్తుంది. సరిగ్గా ఇదే ఇప్పుడు బొత్స సత్యనారాయణ విషయంలోనూ జరుగుతోంది. ఆయన త్వరలోనే పార్టీ మారుతున్నారనే గుసగుసలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా జనసేన(Janasena) అధినాయకత్వంతో ఆయన టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అయితే, ఈ వార్తలపై బొత్స నుంచి రావాల్సినంత గట్టి ఖండన రాకపోవడం పార్టీ శ్రేణుల్లో మరింత కలవరం రేపుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆయన వ్యవహారశైలిపై పార్టీ అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

ధర్మాన సోదరుల ఎంట్రీ.. కొత్త ఈక్వేషన్స్!
ఈ పరిణామాల నేపథ్యంలో బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) పట్టును వీక్‌ చేసేందుకే జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన సోదరులను తెరపైకి తెస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శ పర్యటనలో భాగంగా జగన్ వెంట బొత్స ఎక్కువగా హైలైట్ కావడం, శ్రీకాకుళం సీనియర్ల ప్రాధాన్యత తగ్గడంపై స్థానికంగా విమర్శలు వ్యూహం మార్చేలా చేశాయి. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు కుమారుడు బహిరంగంగానే "విజయనగరం జిల్లా రాజకీయాల్లో పొరుగు జిల్లాల వాళ్ల పెత్తనం ఏంటి?" అని ప్రశ్నించడం ఇరువర్గాల మధ్య పెరుగుతున్న అంతరాన్నిట్టూబట్టుగా బయటపెట్టింది.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లీడర్‌షిప్ తీసుకుని ముందుకు నడిపించడంలో బొత్స విఫలమయ్యారనేది వైఎస్సార్‌సీపీ పెద్దల ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. అందుకే, ఉత్తరాంధ్రలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో జగన్(Jagan) పడ్డారని టాక్‌ నడుస్తోంది. బొత్స ఒంటెద్దు పోకడలకు చెక్ పెట్టేందుకు, శ్రీకాకుళం, విశాఖపట్నం సీనియర్ నేతలకు విజయనగరం వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లాలోని మరికొందరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా బొత్సకు వ్యతిరేకంగా బహిరంగంగా గళం విప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బొత్స నిజంగానే పార్టీ వీడితే ఆయనతో ఎంతమంది జంప్ అవుతారు? లేదా పార్టీలోనే ఉండి ఈ అంతర్గతపోరును ఎలా ఎదుర్కొంటారు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Tags
Botsa Satyanarayana YSRCP JanaSena YS Jagan Uttarandhra Politics AP Politics Dharmana Brothers
Recent Comments
Leave a Comment

Related News