ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రమోషన్కు సంబంధించి టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాష్ట్ర ఇమేజ్ను నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేసే బాధ్యతను మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు పొలిటికల్, సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పర్యాటక రంగాన్ని, పెట్టుబడులను పరుగులు పెట్టించేందుకు ఆయన్ని రంగంలోకి దించాలనే ప్రణాళిక వేగంగా రూపుదిద్దుకుంటోంది.
గుజరాత్ టూరిజం ప్రమోషన్ కోసం బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ చేసిన మ్యాజిక్ ఎలాంటి ఫలితాలను ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిగ్గా అదే ఫార్ములాను ఏపీలోనూ రిపీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్(Megastar)కు ఉన్న మాస్ ఫాలోయింగ్, ఆయనపై అన్ని వర్గాల్లో ఉండే నమ్మకం రాష్ట్రానికి పెద్ద అసెట్గా మారుతుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ఈ ప్రపోజల్పై ప్రాథమిక స్థాయి చర్చలు ముగిసినట్లు తెలుస్తోంది. కేవలం టూరిజం మాత్రమే కాకుండా, రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలోనూ ఆయన ఇమేజ్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్కు సంబంధించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇదే నిజమైతే ఏపీ(AP) టూరిజం అండ్ బ్రాండ్ వాల్యూ నెక్స్ట్ లెవెల్కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.