పుట్టపర్తి నుంచి స్టెల్త్ యుద్ధ విమానాలు టేకాఫ్ కాబోతున్నాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మే 15న భూమి పూజతో నవ చరిత్రకు నాంది పలుకుతున్నామని చెప్పారు. ఐదో తరం (ఫిఫ్త్ జనరేషన్) స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్ట్పై ఏఐ వీడియోను తన ఎక్స్ ఖాతాలో లోకేశ్ విడుదల చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలోని ఈ ఏరో స్పేస్ సెంటర్ ప్రాజెక్టుకు మే 15న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. డీఆర్డీఓ (DRDO) కు చెందిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను డీఆర్డీఓ ఆధ్వర్యంలో, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA) బెంగళూరు సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ సెంటర్లో విమానాల అసెంబ్లీ, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ కార్యకలాపాలు జరుగుతాయి.
సుమారు 140 AMCA యుద్ధ విమానాలు ఇక్కడ తయారీ కానున్నాయి.
ఈ ప్రాజెక్టు కోసం డీఆర్డీఓకు 600 ఎకరాలను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్, శాస్త్రవేత్తల నివాస ప్రాంతాలు, శాటిలైట్ ఆఫీస్ కాంప్లెక్స్లకు భూమి కేటాయింపు జరిగింది. అనుబంధ యూనిట్లు, సంబంధిత పరిశ్రమలకు మరో 400 ఎకరాలు అందుబాటులో ఉంచారు. ఈ ప్రాజెక్టు మరియు సంబంధిత పరిశ్రమల ద్వారా రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో లోకేశ్ ఫైటర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు అని ఎందుకు ఈ ప్రాజెక్టే నిదర్శనం.