అధికారం కోల్పోయినా కొందరు వైసీపీ నేతలకు నోటి దురుసు మాత్రం తగ్గడం లేదు. రైతులపై నోరు పారేసుకోవడంతో స్పెషలిస్ట్ అయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తాజాగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం.. నరికేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.