ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీ-4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్)పై మరింత పట్టు బిగించేలా కార్యా చరణకు రూపకల్పన చేశారు. ఈ క్రమంలో పీ-4 అమలుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. `పీ-4 సొసైటీ`గా పేర్కొనే ఈ వ్యవస్థ ద్వారా… మార్గదర్శకుల(సాయం చేసేవారు)ను గుర్తిస్తారు. సమాజంలో ఉన్నత స్థాయి వర్గాలను గుర్తించి.. వారిని చైతన్య వంతం చేసి.. పేదలకు సాయం చేసేందుకు వారిని మోటివేట్ చేయనున్నారు. ఈ సొసైటీకి.. ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్గా వ్యవహరించనున్నారు. దీనిలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు సభ్యులుగా ఉంటారు.