సినీ నటుడు, రచయిత, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి తాజాగా బిగ్ షాక్ తగిలింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేసిన పోసాని.. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత యాక్టివ్ అయ్యారు. మీడియా ఎదుట టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోయారు. నోటికి హద్దు అదుపు లేకుండా బూతులతో విరుచుకుపడ్డారు.