వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మవారికి తాళి కట్టి చిక్కుల్లో పడ్డారు. హిందూ సమాజం ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2024 ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభకు ఎన్నికైన విరూపాక్షి.. శనివారం శ్రీరామనవమి సందర్భంగా స్వగ్రామం చిప్పగిరిలో నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. అయితే అక్కడ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు వివాదాస్పదం అయింది.