మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చేలా కనిపించడం లేదు. వంశీకి బెయిల్ మంజూరు అయినప్పటికీ.. జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి. మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్పై దాడి, ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రస్తుతం వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా గన్నవరం కోర్టు వంశీకి బెయిల్ ఇచ్చింది. కానీ టీడీపీ ఆఫీస్పై దాడి, కిడ్నాప్ కేసులో కాదు.