అసలే ఇబ్బందులు.. ఇక్కట్లలో ఉన్న వైసీపీకి తాజాగా భారీ షాక్ తగిలింది. వరుసగా నాయకుల అరెస్టులు.. జైళ్ల పర్వంతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏం చేయాలన్న విషయంపైనే పార్టీ తలకిందలు అవుతోంది. ఒకవైపు కేసుల్లో చిక్కుకుని జైళ్లకు వెళ్లిన వారు.. మరోవైపు.. కేసులు నమోదైన వాళ్లు.. ఇలా.. అనేక మంది ఇప్పుడు వైసీపీకి టార్గెట్ గా మారారు. మాజీ మంత్రి విడదల రజనీ.. కేసు డోలాయమానంలో పడింది. మరోవైపు.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు కోసం.. పోలీసులు జల్లెడ పడుతున్నారు.