శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియా ఎక్స్లో ఓ కీలక పోస్టు చేసింది. మాజీ సీఎం ఆ పార్టీ అధినేత జగన్ ఫొటోను వేసి.. `హిందూ ధర్మ పరిరక్షకుడు` శీర్షికతో ఈ పోస్టును పెట్టింది. దేశ విదేశాల్లోనూ.. తిరుమల తిరుపతి దేవస్థానం కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు అని పేర్కొంది. అంతేకాదు.. తన హయాంలో జగన్ హిందూ ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన నేత.. అని కూడా పేర్కొన్నారు.