ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే జగన్ విధ్వంసకర పాలనకు భయపడి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు పరిశ్రమలు సంస్థలు ముందుకు రాలేదు. దీంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడి ఖజానా ఖాళీ అయింది. దీనికి తోడు అందిన కాడికి అప్పులు తెచ్చిన జగన్ సంపద సృష్టించడంలో విఫలం కావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.