కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. హెచ్ సీయూ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎంతమందిపై కేసులు పెట్టకుంటూ వెళ్తారని ప్రశ్నించారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? అని నిలదీశారు.