సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత అమరావతి కి జీవకళ వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ పుణ్యమా అంటూ దాదాపు వెంటిలేటర్ మీదకు చేరిన అమరావతికి చంద్రబాబు ఊపిరి పోశారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా అమరావతిలో నిర్మాణాలు చేపడుతూ ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతికి సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలవాలని చంద్రబాబు నిర్ణయించారు.