గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదే నని బీజేపీ రాష్ట్ర చీఫ్, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బీజేపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్-కాంగ్రెస్ పార్టీలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు దాసోహం చేసేందుకు రెడీ అయ్యాయని ఆయన ఆరోపించారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్లు కూడా.. ఒకే తాను ముక్కలని ఆయన చెప్పుకొచ్చారు.