ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలో పర్యటించచాలని భావించారు. ఏపీ సరిహద్దు జిల్లాగా ఉన్న ఖమ్మంలో ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆదివారం(ఏప్రిల్ 6) శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రఖ్యాత రామ క్షేత్ర భద్రాచలం ఆలయాన్ని పవన్ కల్యాణ్ సందర్శించాలని అనుకున్నారు. ఈ ప్రకారం ఏపీ అధికారులు పవన్ కల్యాణ్కు సంబంధించి ఖమ్మం టూర్ షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. కానీ, అనూహ్యంగా పవన్ టూర్ రద్దయింది.