శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
27వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న సీఎం చంద్రబాబు బృందం
బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పెట్టుబడుల సాధన కోసం రేపటి నుంచి 5 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్న సీఎం
ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
మొదటి రోజు సింగపూర్ లో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
సింగపూర్ తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్ సహా పలు దేశాల నుంచి హాజరు కానున్న తెలుగు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడుదారులు, ఉద్యోగులు.
AP NRT ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి హాజరుకానున్న దాదాపు 1500 మంది ప్రతినిధులు.
సింగపూర్ లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేసిన AP NRT, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు
ఆంధ్రప్రదేశ్ కు చెందిన నిరుద్యోగ యువతకు ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై చర్చ
వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని ఏపీ అభివృద్దిలో భాగస్వాములు చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చ
జీరో పావర్టీ -P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలను కోరనున్న సీఎం
పలు దేశాలకు ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్నారైల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు చేయడంపై చర్చ.
స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడంపై చర్చ
స్పోర్ట్స్, పోర్ట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సందర్శించనున్న సీఎం బృందం
సీఎం చంద్రబాబుతో సింగపూర్ పర్యటనలో పాల్గొననున్న మంత్రులు నారా లోకేష్, టిజి భరత్, పి.నారాయణ, వివిధ శాఖల అధికారులు.