ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ నేత పాక

admin
Published by Admin — April 28, 2025 in Politics, Andhra
News Image

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఆ స్థానం టీడీపీ లేదా జనసేన తరఫున ఒకరికి దక్కుతుందని పలు పేర్లు కూడా వినిపించాయి. మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపించింది. అయితే, అనూహ్యంగా ఆ స్థానం బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణకు దక్కింది.

పెద్ద‌ల స‌భ‌లో బీజేపీకి బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానం కావాలని బీజేపీ నాయ‌కులు కోరారు. ప్రధాని మోడీకి ఆ స్థానాన్ని సీఎం చంద్రబాబు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ పాకాకు టికెట్ వస్తుందని ఆశించినా నాగబాబుకు దక్కింది. శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యక్తిని తొలిసారి బీజేపీ పెద్ద‌ల స‌భ‌కు పంపడం విశేషం.

అసలు రేసులో ఉన్నారని కూడా ఎవరూ అనుకోని పాక పేరు ప్రకటించడంతో అంతా షాకయ్యారు. ప్రస్తుతం బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా ఉన్న పాకాకు పదవి ఇప్పించాలని పురందేశ్వరి సిఫారసు చేశారు.

Tags
bjp high command bjp leader paka satyanarayana rajyasabha seat
Recent Comments
Leave a Comment

Related News