బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలి: గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డా. రాజా

admin
Published by Admin — July 16, 2026 in Politics, Andhra, Nri
News Image

అమరావతి: కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బ్రహ్మం చౌదరి ఈ ఉదయం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై, మెదడులో రక్తం గడ్డకట్టడం (Blood Clot) కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త తీవ్ర ఆవేదన కలిగించిందని గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డా. రాజా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ బ్రహ్మం చౌదరి గారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ కుటుంబం ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని అన్నారు.

ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రవాస తెలుగు సమాజం ప్రార్థించాలని డా. రాజా విజ్ఞప్తి చేశారు.

Tags
brahmam chowdary chairman kamma corporation global nri tdp chief dr raja
Recent Comments
Leave a Comment

Related News