టీడీపీ తరఫున రాజ్యసభకు వెళ్లబోతున్న ముగ్గురు అభ్యర్థులు ఎవరు అన్న అంశంపై కొద్ది రోజులుగా ఏర్పడిన సస్పెన్స్ కు అధిష్టానం తరలించింది టిడిపి తరఫున రాజ్యసభకు నామినేషన్ వేయబోతున్న ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా టిడిపి ప్రకటించింది.
భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, సానా సతీశ్ బాబులకు టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. ఆ ముగ్గురికి సీఎం చంద్రబాబు బీ ఫారాలు అందించారు. సోమవారం వీరు నామినేషన్ వేయనున్నారు. అటు జనసేన రాజ్య సభ అభ్యర్థిగా నేడు లింగమనేని రమేశ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.