రాజకీయాల్లో నిరంతరం బిజీగా ఉంటూ, దేశ ప్రధానిగా క్షణం తీరిక లేకుండా గడిపే నరేంద్ర మోదీ(Narendra Modi)లోనూ ఒక బాల్యపు కోణం ఉంది. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు ఆయన ప్రధాని అన్న సంగతి మరిచిపోయి, వాళ్లతో కలిసి చిన్నపిల్లవాడిగా మారిపోతుంటారు. తాజాగా ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో సరిగ్గా ఇలాంటి దృశ్యమే మరొకటి ఆవిష్కృతమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముద్దుల సంతానంతో ప్రధాని మోదీ సరదాగా గడిపిన క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

తన కార్యాలయాన్ని కేవలం ఒక ఆఫీస్లా కాకుండా, ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర స్థలంగా భావిస్తూ మోదీ దానికి ‘సేవా తీర్థం’ అని పేరు పెట్టారు. తాజాగా ఆ సేవా తీర్థంలోకి ఇద్దరు బుజ్జాయిలు అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడు, కుమార్తెలను ప్రధాని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ చిన్నార్లను ఎత్తుకుని, వాళ్లతో ముచ్చటిస్తూ, రకరకాల ఆటలు ఆడిస్తూ మోదీ కనిపించిన తీరు అక్కడున్న వారిని సైతం ఆశ్చర్యపరిచింది. దేశాన్ని నడిపించే నాయకుడు, ఆ చిన్నారుల నవ్వుల ముందు ఒక తాతగా మారిపోయి మురిసిపోయారు.
తాను ఆ ఇద్దరు ‘యువ స్నేహితులతో’ గడిపిన అపురూప క్షణాలకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ(Modi) స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. ఈ ఫోటోలు బయటకు వచ్చిన నిమిషాల్లోనే నెట్టింట హల్చల్ చేయడం మొదలుపెట్టాయి. లక్షలాది మంది నెటిజన్లు లైకులు, కామెంట్లతో ఈ పిక్స్ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ప్రధానిలో ఇంతటి ఆప్యాయత ఉందా!అంటూ నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ చిన్నారుల అమాయకత్వం, ప్రధాని ముఖంలోని ఆనందం ఈ ఫోటోలకే హైలైట్గా నిలిచాయి.

ఈ మధుర క్షణాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) కూడా ఎంతో భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీని కలవడం తమ కుటుంబానికి ఒక చిరస్మరణీయమైన కానుక అని పేర్కొన్నారు. ప్రధాని చూపించే ఆప్యాయత, ప్రేమ కేవలం ఒక తరానికే పరిమితం కాలేదని.. దివంగత ఎర్రన్నాయుడు గారి కాలం నుండి నేటి తరం పిల్లల వరకు తమ మూడు తరాలను ఆ కరుణా హృదయం ఆకట్టుకుందని ఆయన కొనియాడారు.