ఏపీ సీఎం చంద్రబాబు(ap cm chandrababu)కు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' (Business Reformer of the Year 2025 ) అవార్డును ది ఎకనామిక్ టైమ్స్ (ET) అందించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ముంబైలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
పారిశ్రామికాభివృద్ధి, పరిపాలనలో టెక్నాలజీని ఉపయోగించడం, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో చంద్రబాబు తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు గుర్తింపుగా జాతీయ స్థాయి జ్యూరీ ఈ అవార్డు కోసం చంద్రబాబును ఎంపిక చేసింది.
ఈ అవార్డు తనకు రావడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు తన వ్యక్తిగత విజయం కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కఠిన శ్రమ, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంపై ఉంచిన నమ్మకానికి దక్కిన గౌరవమని అన్నారు.
ఈ అవార్డు తనకు రాలేదని...ఇది రాష్ట్రానికి...మంత్రులు, అధికార యంత్రాంగానికి వచ్చిందని చెప్పారు.
ఈ అవార్డు అందరికీ అంకితం ఇద్దామనుకుంటున్నానని చెప్పారు. తాను ఒక టీం లీడర్, ముఖ్యమంత్రి అని...టీం బాగా పని చేస్తే తనకు మంచి పేరు వస్తుంది..పెన్షన్ల పంపిణీలో 93 శాతం సంతృప్తి ఉందని అన్నారు.