టీడీపీ కమిటీల ఏర్పాటు..చంద్రబాబు మార్క్

admin
Published by Admin — April 15, 2026 in Andhra
News Image

డీపీ పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను పార్టీ హై కమాండ్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ కొనసాగనున్నారు. మొత్తం 29 మందితో పొలిట్‌బ్యూరోను, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించింది అధిష్టానం. టీడీపీ జాతీయ కార్యదర్శులుగా ముగ్గురు, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం కల్పించారు. మొత్తం 185 మందిలో 50 మంది మహిళలే ఉండడం విశేషం. పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు ప్రాధాన్యతనిచ్చారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును దృష్టిలో ఉంచుకొని ఈ నియామకాలు చేపట్టారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో పాటుగా రాజేశ్‌ కిలారులను నియమించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందికి అవకాశం దక్కింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా- 7, రాష్ట్ర ఉపాధ్యక్షులు-16, రాష్ట్ర అధికార ప్రతినిధులు-14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్లు-10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు-59, రాష్ట్ర కార్యదర్శులు-77 మంది ఉన్నారు.  185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో బీసీలు 77మంది ఉన్నారు. ఎస్సీలు 25, ఎస్టీలు 7, మైనార్టీలు 13 మంది ఉన్నారు.   సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఈ కమిటీలను నియమించారు. సీనియర్ నేతలు, యువనేతల కలయికతో ఎంపిక చేశారు.

 

 

Tags
cm chandrababu tdp committees balanced way senior leaders young leaders
Recent Comments
Leave a Comment

Related News