క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు హాజరయ్యారు. ఈ ఉదయం ముంబయి చేరుకున్న మంత్రి లోకేష్ దంపతులు అక్కడ సెయింట్ రెజిస్ హోటల్ లో జరిగిన సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు.
సచిన్ టెండూల్కర్ కుటుంబం మంత్రి లోకేష్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ లను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తరలివచ్చారు.