టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇస్తున్నారన్న ప్రచారం హోరెత్తింది.. జోరుగా సాగింది. మహానాడు వేదికగా మాట్లాడిన నాయకులు కూడా.. నారా లోకేష్ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయనకు పదవి ఇవ్వాల్సిందేనన్న వాదాన్ని బలంగా వినిపించారు. ఇక, ప్రముఖ మీడియా సంస్థలు కూడా..నారా లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇస్తున్నారన్న ప్రచారం కూడా చేశాయి.
కానీ.. మహానాడు వేదికగా అయితే..ఎలాంటి ప్రకటనా రాలేదు. నారా లోకేష్కు పదవిపైపార్టీ అధినేత నుం చి ఎలాంటి సంకేతాలు కూడా రాలేదు. వాస్తవానికి యువగళం సహా.. ఆరు శాసననాల పేరుతో నారా లోకేష్ ను చంద్రబాబు మహానాడు వేదికగా కొనియాడారు. దీంతో ఆయన తప్పకుండా లోకేష్కు పదవిని ఇస్తున్నారన్న సంకేతాలు ఇచ్చేశారని కొందరు భావించారు. కానీ.. మూడు రోజుల సమావేశంలో ఉరుము లు, మెరుపులు తప్ప.. అసలు పనికాలేదు.
మరి ఏం జరిగింది? పదవి విషయంలో తెరవెనుక.. తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి చంద్రబాబు విజన్ రీత్యా.. పార్టీని నడిపించేందుకు ఇప్పుడు యువకులకు ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికలకు యువతను సంసిద్ధులను చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో నెంబర్ 2గా అధికారికంగా నారా లోకేష్ ను నిర్ణయించేస్తారని కూడా అనుకున్నారు. కానీ, ఇక్కడే కీలకమైన రెండు విషయాలు.. చర్చకు వచ్చినట్టు సమాచారం.
1) కూటమిని సుస్థిరంగా ఉంచడం. 2) మరో కొన్ని సంవత్సరాల పాటు.. నారా లోకేష్ పార్టీతో మమేకమయ్యేలా చూడడం. ఈ రెండు విషయాలు కూడా.. చంద్రబాబును వెనుకడుగు వేయించాయని తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి బలంగా ఉంది. రేపు నారా లోకేష్ కనుక పార్టీలో అధికారికంగా నెంబర్ 2 అయితే.. అది కొంత ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక, ఇప్పటికే అనుభవం ఉందని భావించినా.. మరింత మెరుగు పడితే.. అది నారా లోకేష్ నాయకత్వానికినారా లోకేష్ కనుక పార్టీలో అధికారికంగా నెంబర్ 2 అయితే.. అది కొంత ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక, ఇప్పటికే అనుభవం ఉందని భావించినా.. మరింత మెరుగు పడితే.. అది నారా లోకేష్ నాయకత్వానికి పెట్టని గోడగా మారుతుందన్న అంచనా కూడా ఉంది. అందుకే.. తాజా నిర్ణయాన్నికొన్నాళ్లపాటు వాయిదా వేసుకుని ఉంటారని అంటున్నారు.