టీడీపీ మహానాడు ముగిసింది. గతానికి భిన్నంగాదీనిని నిర్వహిస్తామని చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు అన్నట్టుగానే కనీ వినీ ఎరుగని రీతిలో మహానాడును నిర్వహించారు. కేవలం సంబరాలు.. ఆడంబరాలకే పరిమితం అయ్యారా? అంటే.. కాదు.. మహానాడు వేదికగా.. కీలకమైన మార్గనిర్దేశం చేశారు. ఏం చేయాలి? ఏం చేయకూడదో విస్ఫష్టంగా తమ్ముళ్లకు వివరించారు. అంతేకాదు.. పార్టీకి దశ-దిశను కూడా ఏర్పరిచా రు.
1) ఏంచేయాలి.. ?
పార్టీ తరఫున నాయకులు ఎలా వ్యవహరించాలో మహానాడు పేర్కొంది. అధికారం ఉందని విర్రవీగొద్దని.. ప్రజలకు మేలైన సేవలు అందించేందుకు ముందుకు ఉరకాలని తద్వారా మరింత మందిని ఆకర్షించే లా వ్యవహరించాలని కూడా మహానాడు స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికలు కూడా కీలకమైనవేనని.. పేర్కొం ది. క్షేత్రస్థాయిలో కలివిడి రాజకీయాలకు పెద్దపీట వేసిన మహానాడు.. కలిసి ఉంటే కలదు సుఖం అనే సూక్తిని చెప్పకనే చెప్పింది. తద్వారా.. ఈ కూటమి మూడునాళ్ల ముచ్చట కాదన్నది స్పష్టం చేసింది.2) ఏం చేయకూడదు ?
ఇక, మహానాడు ద్వారా క్షేత్రస్థాయిలో నాయకులు ఏం చేయకూడదో కూడా.. స్పష్టం చేయడం గమనార్హం. నాయకుల మధ్య వివాదాలు, విభేదాలను తగ్గించుకోవాలని పేర్కొంది. కోవర్టు రాజకీయాలు చేసే నాయకు లకు బలమైన హెచ్చరికలు పంపించింది. జంపింగులు తమ హద్దులు తెలుసుకుని వ్యవహరించక పోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రకటించింది. ప్రజలకు చేరువ కావడం.. పారదర్శకంగా వ్యవహరించడం అనేక కీలక అంశాలను కూడా మహానాడు ప్రకటించినట్టు అయింది.3) దిశానిర్దేశం..!
ఈ కూటమి ఎన్నాళ్లు ఉంటుందో.. అనే ప్రత్యర్థుల వ్యాఖ్యలను తిప్పికొట్టిన మహానాడు.. కూటమి వల్లే ప్రస్తుత అధికారం దక్కిందని బలమైన సంకేతాలు ఇచ్చింది. ఈ కూటమి దాదాపు శాశ్వతమనే భావనను కలిగించింది. భవిష్యత్తు-వర్తమానాల్లోనూ.. కూటమికి ప్రాధాన్యం ఇచ్చింది. జనసేన, బీజేపీలురెండూ టీడీపీకి అత్యంత అవసరమని సంకేతాలు పంపించింది. తద్వారా.. క్షేత్రస్తాయిలో నాయకుల కలయిక.. కలిసి పనిచేయడం అనే కీలక అంశాలపై మహానాడు దిశానిర్దేశం చేసింది.