ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వ్యాఖ్యలు చేసి కిరణ్ ను పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. అంతేకాదు, కిరణ్ పై టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి హుటాహుటిన అరెస్టు చేశారు. ఇటువంటి వ్యాఖ్యలను పార్టీ ఏ మాత్రం సహించదని సీఎం చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు పంపించారు. దీంతో, టీడీపీ నిబద్ధత, క్రమ శిక్షణ ఇది అని ప్రశంసలు కురుస్తున్నాయి.