తెలంగాణాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల తొలగింపు వ్యవహారంలో ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా లెక్కలతో రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా ఇప్పుడు దూకుడుగా విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళ కాలంలో జరిగిన అటవీ విధ్వంసంఒయు లెక్కలతో ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరిత హారం కార్యక్రమం నుంచి అటవీ భూముల విక్రయం వరకు పెద్ద ఎత్తున చెట్లను నరికారని మండిపడుతోంది.