లిక్కర్ స్కామ్ లో ఏపీ సీఐడీ ఎక్కడ అరెస్ట్ చేస్తుందో అని భయపడుతున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తాజాగా బిగ్ రిలీఫ్ లభించింది. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకోవడంతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. పలువురిని నిందితులుగా చేర్చింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎంపీ మిథున్ రెడ్డి కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.