వారికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు

admin
Published by Admin — April 30, 2025 in Andhra, Politics
News Image

సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం దర్శించేందుకు వచ్చిన ఏడుగురు భక్తులు గోడ కూలి మరణించారు. ఈ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు వెంటనే స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

బాధిత కుటుంబసభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ.3 లక్షల నష్ట పరిహారం అందించాలని ఆదేశించారు. ఈ ఘటన తనను కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ ఘటనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడానని చంద్రబాబు చెప్పారు. ఈ ఘటనపై ముగ్గురు ఉన్నతాధికారులతో ఓ విచారణ కమిటీని కూడా వేశామని తెలిపారు.

ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన పవన్…మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

ఈ దుర్ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యానని మంత్రి లోకేశ్ అన్నారు. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి క్షతగాత్రులకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. శిథిలాల తొలగింపు కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు.

Tags
25 lakh rupees ex-gratia cm chandrababu mishap
Recent Comments
Leave a Comment

Related News