ఆ మహిళా నేతకు టీడీపీ షాక్‌.. పార్టీ నుండి స‌స్పెండ్!

admin
Published by Admin — April 29, 2025 in Politics, Andhra
News Image

సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయ‌ని ఇప్ప‌టికే ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. హ‌ద్దు దాటిన వారిపై వేటు వేసేందుకు కూడా ఏమాత్రం వెన‌కాడ‌టం లేదు. ఇటీవ‌ల రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన చేబ్రోలు కిరణ్ వ్యవహారం ఇందుకు ఒక ఉదాహ‌ర‌ణ‌. అయితే తాజాగా టీడీపీ అధిష్టానం ఓ మ‌హిళా నేతకు బిగ్ షాక్ ఇచ్చింది.

తెలుగు మహిళ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌గా ఉన్న సందిరెడ్డి గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. `టీడీపీ అంటే క్రమశిక్షణకి మారుపేరు. అటువంటి పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో పాటు సోషల్ మీడియాలో సందిరెడ్డి గాయత్రిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశిస్తున్నాము` అంటూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

కాగా, సందిరెడ్డి గాయత్రి విజ‌య‌వాడ‌కు చెందిన‌వారు. చాలా కాలంగా ఆమె టీడీపీ కోసం ప‌ని చేస్తున్నారు. గ‌త ప్రభుత్వంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలకు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటుగా కౌంట‌ర్ ఇస్తూ టీడీపీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. టీవీ డిబేట్స్‌లోనూ టీడీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపించారు. సోషల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే సందిరెడ్డి గాయత్రి.. ఇప్పుడు అదే సోష‌ల్ మీడియా కార‌ణంగా స‌స్పెన్ష‌న్ కు గురికావ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది.

Tags
Andhra Pradesh AP News ap politics
Recent Comments
Leave a Comment

Related News