సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మల్లో పాయల్ రాజ్పుత్ ఒకరు. 2017లో పంజాబీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన పాయల్.. తెలుగులో `ఆర్ఎక్స్ 100`తో బ్రేక్ అందుకుంది. ఈ సినిమా యూత్ లో ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దురదృష్టం ఏంటంటే.. ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ పాయల్ అందుకోలేకపోయింది. 2023లో వచ్చిన `మంగళవారం` మూవీ మంచి విజయమే సాధించినా.. పాయల్ కు ఒరిగిందేమి లేకుండా పోయింది.
ఈ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం పాయల్ రాజ్పుత్ అరుదైన కంటి వ్యాధితో బాధపడుతుందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె స్వయంగా వెల్లడించింది. `నాకు కంటి సమస్య తలెత్తింది. దాని పేరును కూడా కరెక్ట్ గా పలకలేకపోతున్నా. ఇప్పుడు నా కంటికి ఏదీ సరిగ్గా కనిపించడం లేదు. ఒకటి రెండుగా కనిపిస్తున్నాయి. పైగా చాలా అస్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇచ్చిన కమిట్మెంట్కి అనుగుణంగా ప్రోగ్రామ్స్, ఈవెంట్కు హాజరవుతున్నాను. నా ఈ సమస్య ఎలా తీరుతుందో తెలియడం లేదు.. అంతా ఆ దేవుడి దట. ప్రస్తుతానికి కళ్లద్దాలతో మ్యానేజ్ చేస్తున్నాను` అంటూ ఇన్స్టా స్టోరీలో పాయల్ చెప్పుకొచ్చింది.
పాయల్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో.. అభిమానులు ఆమెకు ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. కాగా, ప్రస్తుతం పాయల్ రాజ్పుత్ తమిళంలో `గోల్మాల్`, `ఏంజెల్` అనే చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన `3 రోజెస్` వెబ్ సిరీస్ కు త్వరలోనే సీజన్ 2 రాబోతుంది. అందులో కూడా పాయల్ భాగం అయినట్లు తెలుస్తోంది.