సీమ ప్రజలకు చరిత్రాత్మక దినం: లోకేశ్

admin
Published by Admin — July 03, 2026 in Andhra
News Image

ఓ పక్క ఏపీ సీఎం చంద్రబాబు...మరో పక్క మంత్రి నారా లోకేశ్...ఇద్దరూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఏపీకి పెట్టుబడులు తేవడంతో పాటు పరిశ్రమల నిర్మాణాలు పూర్తి అయ్యేలా చొరవ తీసుకుంటూ పెట్టుబడిదారులకు ఈ ఇద్దరూ కొండంత భరోసానిస్తున్నారు. ఈ క్రమంలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని 2028 జూలై 3 నాటికి పూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం సీమవాసుల దశాబ్దాల కల అని లోకేశ్ అన్నారు. ఆ దిశగా చరిత్రాత్మక అడుగు పడిందని లోకేశ్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేశామన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో సీమ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. విజయనగరంలో జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కు పనులను కూడా ప్రారంభించామని తెలిపారు.

ఏపీని అభివృద్ధి పథంలో నిలపాలన్న కూటమి ప్రజా ప్రభుత్వ ఉక్కు సంకల్పానికి ఈ ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనే నిదర్శనమని లోకేశ్ అన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'తో రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.

Tags
Lokesh steel plant
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News