ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన రూట్ మార్చారు. టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదిగిన ఈ 'పుష్ప' రాజ్, ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం ఏకంగా నగరాన్నే విడిచి వెళ్లాలని నిర్ణయించుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రాక' సినిమా కోసం బన్నీ తన మకాంను ముంబైకి షిఫ్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిరంతరం హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించడం వల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా, సినిమా మేకింగ్పై ఏకాగ్రత దెబ్బతింటుందని భావించి బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ చూడని విధంగా మూడు విభిన్న పాత్రల్లో మెరవబోతున్నారు. 'సన్ పిక్చర్స్' అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్లో దీపికా పదుకొనే(Deepika Padukone) మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ముగ్గురు స్టార్ హీరోయిన్లు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. కేవలం స్టార్ కాస్ట్ మాత్రమే కాదు, అట్లీతో ఉన్న స్నేహంతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ గెస్ట్ రోల్లో కనిపిస్తారనే వార్త నెట్టింట మంట పుట్టిస్తోంది.
హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందుతున్న రాక(Raaka), ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో రికార్డులను తిరగరాస్తుండగా, 2026 చివరి నాటికి ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.