సినీ నటి, బీజేపీ మహిళా నాయకులు మాధవీ లత ఒక వ్యాభిచారి అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు జారి వార్తల్లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జేసీ దిగొచ్చారు. మాధవీ లతకు మీడియా ముఖంగా క్షమాణలు చెప్పారు. వయసు, ఆవేశం రీత్యా మాధవి లత గురించి అలా మాట్లాడాను. ఒక మహిళ గురించి ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని జేసీ తన తప్పును అంగీకరించారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని.. మనస్ఫూర్తిగా మాధవీ లతకు క్షమాపణలు చెబుతున్నానని జేసీ ప్రకటించారు.
తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల హస్తం ఉందంటూ ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అలాగే నటి మాధవీలత ఒక వ్యాభిచారని.. ఆమెను బీజేపీలోకి ఎలా తీసుకున్నారో అర్థం కావాట్లేదంటూ జేసీ పరుష వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వివాస్పదం అయ్యాయి. మాధవీలతతో పాటు బీజేపీ నాయకులు జేసీ తీరు పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో జేసీ దిగొచ్చి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు. మరి ఇంతటితో వివాదం ముగుస్తుందా? లేదా? అన్నది చూడాలి.