దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 8వ తేదీన మోదీ పర్యటన ఖరారు అయింది. ఈ సందర్భంగా విశాఖలో బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నరు. మోదీ ఏపీ టూర్ కు ఇంచార్జ్గా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ .. విశాఖలో జరగబోయే బహిరంగసభ భారీ సక్సెస్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ ఛీప్ వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని, ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని షర్మిల మండిపడ్డారు. `ఈనెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ గారిని, రాష్ట్రంలోని కూటమి పార్టీలను కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం తక్షణమే క్లారిటీ ఇవ్వాలి. SAILలో విలీనం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెంటనే విడుదల చేయాలి.