పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం కుంభకోణంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట నిర్మించిన గోదాముల్లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు అధికారులు నిగ్గు తేల్చారు. ఈ వ్యవహారంలో పేర్ని నాని, పేర్ని జయసుధతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పేర్ని నాని హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోగా.. ఆయన భార్యకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.