రాజకీయాల్లో జంపింగులకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. అర్ధబలం అంగబలం అన్నీతామై శాసిస్తున్న ఈ రోజుల్లో రాజకీయాలు కూడా వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరు ఆర్థికంగా బలంగా ఉంటే.. వారితోనే రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. దీంతో పార్టీలు మారుతున్నవారు పెరుగుతున్నారు. ఎంతో నమ్మకంగా ఉన్నవారు కూడా.. పార్టీలకు రాం రాం చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో జంపింగు లకు షాకిస్తూ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కడపలో జరుగుతున్న మహానాడులో రాజకీయ నేతల జంపింగులపై మాట్లాడిన చంద్రబాబు.. కార్యకర్తల ముందు.. వారికి ఎలాంటి ప్రాధాన్యం ఉండదని తేల్చేశారు. “టీడీపీలోకి వలస పక్షులు .. వస్తాయి పోతా యి“ అని చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. వీరికంటే కూడా.. పార్టీకి కార్యకర్తలే కీలకమని వ్యాఖ్యానించారు. వలస పక్షుల ముందు.. కార్యకర్తలే పార్టీకి వెన్నెముకగా అభివర్ణించారు. నాయకులు పోతే తయారు చేసు కుంటామని కూడా చెప్పారు
ఇక, కోవర్టుల గురించి కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కోవర్టుల గురించి ఆరా తీశారు. కోవర్టులుగా వ్యవహరించేందుకు పార్టీలోకి కొందరు వస్తున్నారని.. వారి విషయంలో కార్యకర్తలు అప్రమ త్తంగా ఉండాలని చంద్రబాబు కోరారు. కోవర్టులు కార్యకర్తలను దూరం చేసే ప్రక్రియలు కొన్ని కొన్ని చోట్ల కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన.. అలాంటి చోట నిర్మొహమాటంగా కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు.
సో.. మొత్తంగా అటు జంపింగుల విషయంపైనా.. ఇటు కోవర్టుల వ్యవహారంపైనా మహానాడు వేదికగా చం ద్రబాబు సూటిగా సుత్తిలేకుండానే చెప్పేశారు. అయితే.. ఈ మార్పు సాధ్యమేనా? అన్నది ప్రశ్న. ఎందు కంటే.. దాదాపు చాలా నియోజకవర్గాల్లో జంపింగు నాయకుల హవానే కొనసాగుతోంది. ఎవరికి వారుగా రాజకీయాలు చేసుకుంటున్నారు. వీరిని కాదనలేని పరిస్థితి నెలకొంది.