నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ బ్లాక్ బస్టర్ `డాకు మహారాజ్` ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. బాబీ కొల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. నందమూరి అభిమానుల నుంచే కాకుండా సామాన్య ప్రేక్షకుల కూడా పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవ్వబోతోంది.
ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ వారమే డాకు మహారాజ్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఫిబ్రవరి 21 నుంచి బాలయ్య నటించిన డాకు మహారాజ్ ను తమ ఫ్లాట్ఫామ్ లో వీక్షించవచ్చు అంటూ నెట్ఫ్లిక్స్ తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమైన డాకు మహారాజ్ చిత్రంలో బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించింది.