సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జున్ ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా ఆయన ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ నాలుగు రోజుల క్రితమే పూర్తికాగా ఈ రోజు తీర్పు వెలువడింది.