పవన్ తో భేటీ..జనసేనలోకి రాజేంద్రప్రసాద్?

admin
Published by Admin — February 17, 2025 in Politics, Movies
News Image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో పవన్ ను రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కు శాలువా కప్పి సత్కరించారు రాజేంద్రప్రసాద్. ఆ తర్వాత ఈ ఇద్దరు నటులు కాసేపు సమకాలీన రాజకీయాలు, సినిమాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

ఇటీవల వాడెవడో ఎర్ర చందనం దొంగ హీరో అట అంటూ పుష్ప-2 గురించి రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. తాను తన సినిమాలతో పాటు ఆ సినిమా గురించి కూడా మాట్లాడానని అన్నారు. ఇక, లక్ష్మీ పార్వతిపై కూడా రాజేంద్ర ప్రసాద్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాటి పరిస్థితులను, టీడీపీని చంద్రబాబు కాపాడిన వైనం గురించి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ పవన్ కల్యాణ్ ను కలవడం వెనుక రాజకీయ ప్రాధాన్యత ఏమన్నా ఉందా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒకవేళ రాజేంద్ర ప్రసాద్ రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారా…? జనసేనలో ఆయన చేరబోతున్నారా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Recent Comments
Leave a Comment

Related News