లోకేశ్ డిప్యూటీ సీఎం పదవిపై తేల్చేసిన టీడీపీ హై కమాండ్

admin
Published by Admin — January 20, 2025 in Politics
News Image

మంత్రి నారా లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ టీడీపీ నేతలు కొందరు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. యువగళం పాదయాత్రతో లోకేష్ ప్రజలకు చేరువయ్యారని, కూటమి గెలుపులో యువగళం కీలక పాత్ర పోషించిందని, అందుకే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో, జనసేన అధినేత పవన్ ను సీఎం చేయాలని కొందరు జనసేన నేతలు మరో డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇటు మీడియాలో చర్చనీయాంశం కాగా..సోషల్ మీడియాలో ఇరు పార్టీల మధ్య తీవ్రమైన చర్చకు దారి తీసింది.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం స్పందించింది. అటువంటి డిమాండ్లను తీసుకురావద్దని, ఆ విషయం గురించి ఎవరూ మీడియా ముందు మాట్లాడవద్దని హెచ్చరించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాలేదని, ఇటువంటి డిమాండ్లు సరికాదని తెలిపింది. ఆ విషయంపై టీడీపీ నేతలెవరూ అత్యుత్సాహం ప్రదర్శించ వద్దని తేల్చి చెప్పింది. అటువంటి విషయాలపై కూటమి నేతలు సమిష్టిగా చర్చించిన తర్వాతే నిర్ణయాలుంటాయని చెప్పింది.

కాగా, టీడీపీకి కోటి సభ్యత్వాలు చేయించిన లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని, ఆయన ఆ పదవికి 100శాతం అర్హులని పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ అన్న సంగతి తెలిసిందే. టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారికి ‘యువగళం’తో లోకేశ్ సమాధానమిచ్చారని అన్నారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని చెప్పారు.

ఇక, లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదని తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌ అన్నారు. అయితే, తాము కూడా పవన్ కల్యాణ్‌ ఏపీ సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. పవన్ సీఎం కావాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయని అన్నారు. ఇలా, టీడీపీ..జనసేన నేతల మధ్య అభిప్రాయలు వెలువుడుతున్న నేపథ్యంలోనే టీడీపీ హై కమాండ్ తాజాగా ఆ ప్రకటన చేసింది.

 
Recent Comments
Leave a Comment

Related News

Related News

ఏపీలో నమో అంటే నాయుడు మోదీ: లోకేష్ నమో...భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరుకు షార్ట్ కట్. ఆయన అభిమానులు ముద్దుగా మోదీని నమో అని పిలుస్తుంటారు. ప్రపంచ దేశాలలో కూడా నమో బ్రాండ్ కు మంచి గుర్తింపు ఉంది. అదే విధంగా మోదీ సమకాలీకుడైన ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా గ్లోబల్ ఇమేజ్ ఉంది. జాతీయ మీడియాలో చంద్రబాబును నాయుడు అని సంబోధిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇకపై ఏపీలో నమో అంటే నాయుడు అండ్ మోదీ అని మంత్రి లోకేష్ కొత్త భాష్యం చెప్పారు. ఈ ఇద్దరు సమర్థ నేతల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు పరుగులు పెడుతోందని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్త నగరాలు నిర్మించిన చరిత్ర ఉందని చెప్పారు. ఆ అనుభవంతోనే అద్భుతమైన అమరావతి నిర్మాణం చేపట్టారని కితాబిచ్చారు. దేశవిదేశాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించి చరిత్ర సృష్టిస్తున్నామని తెలిపారు. యుఎస్ – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బ్రెయిన్ డ్రెయిన్ నుంచి బ్రెయిన్ గెయిన్ చేస్తున్నామని, కేవలం 17నెలల్లో $120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. విశాఖలో గూగుల్ $15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టబోతోందని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారును చూసి ఏపీలో పెట్టబడులు పెడుతున్నారని చెప్పారు.

Show All
Latest News